Friday, May 10, 2024

విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ ధర్నా

కర్నూలు : పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసిస్తూ కర్నూల్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వస్తువుల ధరలను పెంచుతూ పోతుందన్నారు. ప్రభుత్వ అసమర్థత మూలంగా సామాన్యుడు ఇప్పటికే మోయలేని భారాలను భరిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం విద్యుత్ చార్జీల పెంపుతో అన్ని వర్గాల ప్రజలపై 57 వేల కోట్ల భారం మోపడం సిగ్గుచేటు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement