Sunday, April 28, 2024

ఆనందయ్య మందుపై బాలయ్య సంచలన వ్యాఖ్య

ప్రస్తుతం ఆనందయ్య పేరు దేశమంతా మార్మోగిపోతోంది. కరోనా బాధితులకు ఆనందయ్య మందు బాగా పనిచేస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఆయన మందుకు నాటుకు డిమాండ్ ఏర్పడింది. ఆనందయ్య మందుకు ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. తాజాగా నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మద్దతు ప్రకటించారు.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులు ఆనందయ్య మందు గురించి ప్రస్తావించగా తనదైన శైలిలో కామెంట్ చేశారు. ఆనందయ్య కరోనా మందుపై తనకు నమ్మకం ఉందన్నారు. అభిమానం లేనిదే ఆరాధన లేదని, ఆరాధన లేనిదే మతం లేదన్నారు. మతం లేనిదే మానవుడే లేడన్నారు. అలాగే ప్రతీది ఒక నమ్మకం..ఆయుర్వేదాన్ని తాను తప్పకుండా నమ్ముతానని చెప్పారు. ‘’ మన దేశంలో గొప్పగొప్ప వైద్యులున్నారు. క్రీస్తు పూర్వమే సుశ్రుతుడనే వైద్యుడుండే వాడు. ఆ కాలంలోనే ఆయ ఓ గొప్ప సర్జన్. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్‌లో ఉన్న రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జరీలో ఇప్పటికే ఆయన పేరు రాసుంటుంది. అలాంటి గొప్పవారిని మనం మరిచిపోయాం’’ అని బాలయ్య వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement