ఆనందయ్య కరోన మందు పై ప్రభుత్వం త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తుందని అన్నారు ఆయుష్ కమిషనర్ రాములు. సీఎం జగన్ కూడా ఇదే విషయమై అధికారుల తో చర్చిస్తున్నారునోటి నుంచి ఇచ్చే మందు పై అభ్యంతరాలు లేవు.కానీ కంటి నుంచి ఇచ్చే మందు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి..శాస్త్రీయత చూడాలన్నారు. ఈ మందు చట్టపరంగా ఆయుర్వేదం కాదని..ఆయుర్వేదంలో ఇప్పుడు కరోన కి కొన్ని మందులు ఉన్నాయని అన్నారు. ICMR టీం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లో పర్యటించదని చెప్పారు. ICMR అవసరం ఇప్పుడు ఉండదు…అవసరం అయితే కేంద్ర ప్రభుత్వం ఈ మందు విషయంలో పరీక్షలు జరుపుతుందని అన్నారు ఆయుష్ కమిషనర్ రాములు.
Advertisement
తాజా వార్తలు
Advertisement