Thursday, April 18, 2024

తెలంగాణలో కొత్తగా 3,821 కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,821 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ బారినపడిన వారిలో 4,298 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 5,60,141కి పెరిగాయి. 5,18,266 మంది కోలుకున్నారు. మొత్తం యాక్టివ్‌ కేసులు 38,706కి చేరాయి. 3,169 మంది మృతి చెందారు. ఇవాళ 81,203 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 537 బ‌య‌ప‌ట‌డ‌గా.. ఆ త‌ర్వాత ఖ‌మ్మం జిల్లాలో 245, రంగారెడ్డి జిల్లాలో 226, మేడ్చ‌ల్ జిల్లాలో 215, సూర్యాపేట‌ జిల్లాలో 161 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement