Thursday, May 2, 2024

సీబీఐ విచార‌ణ‌కు అవినాష్ గైర్హాజ‌రు..

వైసీపీ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణకు గైర్హాజ‌ర‌య్యారు. మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య‌ కేసులో నేడు CBI ముందు అవినాష్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న… కడప MP అవినాష్ రెడ్డి ఇవాళ మరోసారి CBI విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే.. చివరి క్షణంలో త‌న తల్లి అనారోగ్యంగా ఉండ‌డంతో పులివెందులకు బ‌య‌ల్దేరారు ఎంపీ అవినాష్‌రెడ్డి. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి ఆయ‌న‌ పులివెందులకు వెళ్తున్నారు. దీంతో సీబీఐ విచారణకు వైసీపీ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి దూరం అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement