Saturday, May 4, 2024

AP : సైనికునిపై దాడిలో… నలుగురి కానిస్టేబుల్​ సస్పెండ్​

సైనికునిడిపై న‌లుగురి కానిస్టేబుల్స్ దాడి చేసిన ఘ‌ట‌న‌లో కానిస్టేబుల్స్ స‌స్పెండ్‌కు డీజీపీ రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సంతబయలులో జవాను అలీముల్లాతో దిశ యాప్ డౌన్‌లోడ్‌ చేయించిన తర్వాత ఓటీపీని పోలీసులు నమోదు చేసుకోవడంపై తలెత్తిన వాగ్వాదంలో అతనిపై దాడి చేసి పోలీస్ స్టేషన్ కు బలవంతంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో నలుగురు కానిస్టేబుళ్లు ఆటోలో ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో జవాను కేకలు వేయడాన్ని స్థానికులు వీడియోలో చిత్రీకరించారు. పోలీసుల దాడిని స్థానికులు అడ్డుకుని నిలదీయడంతో అతడిని వదిలేశారు. ఇదిసోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై బాధితుడు మంగళవారం సాయంత్రం ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించ‌గా మంగళవారం రాత్రి బాధ్యుల్ని విఆర్ కు పంపి విచారణ జరిపారు. జవానుపై దాడి చేసిన కానిస్టేబుళ్లను విధుల నుంచి తప్పిస్తూ జిల్లా ఎస్పీ కేవీ.మురళీకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement