Friday, April 26, 2024

ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే స‌త్య‌కుమార్ కాన్వాయ్ పై దాడి.. చంద్ర‌బాబు

ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే బీజేపీ నేత‌ స‌త్య‌కుమార్ కాన్వాయ్ పై దాడి జ‌రిగింద‌ని, ఈ దాడిని ఖండిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై నేటితో 1200 రోజులు అవుతున్న సందర్భంగా మందండంలో నిర్వహించిన సభలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆ శిబిరం వద్దకు వెళ్లి వ‌స్తుండ‌గా అమరావతి ప్రాంతంలో ఆయనపై దాడి జరిగింది. మందండం గ్రామంలో మూడు రాజధానులకు మద్దతుగా కొంతమంది శిబిరం నిర్వహిస్తున్నారు.

అయితే ఆయన అటుగా వెళుతున్నారని ముందుగా సమాచారం తెలుసుకున్న కొంతమంది సత్యకుమార్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. మరి కొంతమంది రాళ్లతో దాడి చేశారు. దీంతో సత్యకుమార్ కాన్వాయ్ కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన పై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. అమరావతి ఉద్యమానికి మద్దతు పలికి వస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై వైసీపీ గుండాల దాడిని ఖండిస్తున్నాన‌న్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై వైసీపీ మూకలు దాడులకు పాల్పడుతున్నాయన్నారు. అక్కడే ఉన్న పోలీసులు దుండగులను ఎందుకు అడ్డుకోలేదని చంద్ర‌బాబు ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement