Thursday, April 18, 2024

తెలుగు ఇండియన్ ఐడల్2 సింగ‌ర్స్ పై.. బాలీవుడ్ స్టార్ సింగ‌ర్స్ పొగ‌డ్త‌లు

తెలుగు ఓటీటీ ఆహా..జ‌నాల‌ని ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి కొత్త కొత్త పోగ్రామ్స్ తో ముందుకు దూసుకెళ్తోంది. కాగా ఆహాలో
తెలుగు ఇండియన్ ఐడల్2 ప్ర‌సారం అవుతోంది. ఈ షోలో సింగర్స్ టాలెంట్ చూసి ఫిదా అయ్యారు బాలీవుడ్ మ్యూజిక్ ఐకాన్స్ హిమేష్ రేష్మియా, శ్రేయా ఘోషల్, విశాల్ డడ్లాని.ఇటీవల పోటీలో భాగంగా నిర్వహించిన గాలా విత్ బాలా ఎపిసోడ్‏లో సౌజన్య భాగవతుల అనే కంటెస్టెంట్ ఆలపించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలోని ఎంకిమీడ నా జతవిడి… సాంగ్ విన్న ప్రముఖ గాయని శ్రేయాఘోషల్ సంతోషం వ్యక్తం చేశారు. సౌజన్య గాత్రం అత్యంత మధురంగా ఉందంటూ కితాబిచ్చారు. ఆ చిత్రంలో ఒరిజినల్ పాటను శ్రేయానే ఆలపించారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ సంగీతకారులు విశాల్ దద్లాని, హిమేష్ రేషిమియా షోకు వస్తున్న ఆదరణను ప్రశంసించారు. ఈ షో ఇలాగే దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షించి, కంటెస్టెంట్స్ కు అల్ ది బెస్ట్ చెప్పారు.

ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ఆడియన్స్ ముందుకు తీసుకవస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆహాలో సూపర్ హిట్ అయిన షోలలో తెలుగు ఇండియన్ ఐడల్ ఒకటి. అద్భుతమైన టాలెంట్ ఉండి.. నిరూపించుకోవడానికి ఒక ప్లాట్ ఫామ్ కోసం ఎదురుచూసే యువ గాయనీగాయకులకు మంచి ఛాన్స్ ఇస్తూ.. వారిలోని ప్రతిభను వెలికితీస్తూ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇందులో నిర్వహించిన మొదటి సీజన్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ సీజన్ సక్సెస్ ఫుల్ గా రన్నింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆహాలో స్ట్రీమ్ అవుతోన్న తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2’కు విశేష ఆదరణ లభిస్తోంది. షో గురించి ఆహా మార్కెటింగ్ హెడ్ కార్తీక్ కనుమూరు మాట్లాడుతూ తెలుగు ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్స్ తమ గాత్రంతో యావత్ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందండం చాలా సంతోషంగా ఉంది. ఆహా ఓటీటీ ఈ షో ద్వారా ప్రతిభావంతులైన గాయకులను ప్రపంచానికి పరిచయం చేయడంలో విజయవంతమౌతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement