Friday, May 17, 2024

Review Meetings – ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ బ్రోచర్‌ను విడుద‌ల చేసిన జ‌గ‌న్

తాడేప‌ల్లి – ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్షపై సమీక్ష నిర్వ‌హించారు. అనంతరం సీఆర్‌డీఏపై కూడా సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు, పలువురు అధికారులు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ రూపొందించిన బ్రోచర్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విడుదల చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా అనే అంశంపై ఈ బ్రోచర్‌లో వివరించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement