Saturday, May 18, 2024

Jail Dairy day 3 – రేపు చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ములాఖ‌త్…

రాజ‌మండ్రి – ప్ర‌స్తుతం రాజ‌మండ్రి కేంద్ర క‌ర్మ‌గారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్ర‌బాబు నాయుడుని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లువ‌న‌న్నారు.. రేప‌టి ములాఖ‌త్ కు అనుమ‌తి ఇవ్వ‌వ‌ల‌సిందిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసుకున్న అభ్య‌ర్ధన‌ను జైలు వ‌ర్గాలు అంగీక‌రించారు.. రేపు మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ప‌వ‌న్ టిడిపి అధినేత‌ను క‌లువ‌న‌న్నారు.. కాగా, చంద్ర‌బాబు మూడో రోజు జైలు లో సాదాసీదాగా గ‌డిపారు. ఉద‌యం కొంత సేపు యోగ‌, న‌డ‌క కొన‌సాగించారు.. వైద్యులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.. ఇంటి నుంచి వ‌చ్చిన అల్పాహారాన్ని, లంచ్ ను తీసుకున్నారు.. అలాగే లీగ‌ల్ టీమ్ ఆయ‌న‌ను నేడు క‌లిసి వివిధ ప‌త్రాల‌పై సంత‌కాలు తీసుకుంది.. బెయిల్, స్కాష్, క‌స్ట‌డీ, త‌దిత‌ర అంశాల‌పై కోర్టులో పిటిష‌న్ లు దాఖ‌లు చేసేందుకు వీలుగా ఈ సంత‌కాలు సేక‌రించారు.. ఇక న్యాయ‌వాది లూద్రా నేటి సాయంత్రం చంద్ర‌బాబును క‌లువ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement