Monday, April 29, 2024

ఏపీఈఏపీ సెట్‌ ఫలితాలు విడుదల

ఏపీఈఏపీ సెట్‌ 2022 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఈఏపీసెట్‌-2022 సెట్ నిర్వహించారు. ఈనెల 4 నుంచి 12వ తేదీ వరకు ఈఏపీ సెట్‌ నిర్వహించారు. మొత్తం 3,01,172 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా 2,82,496 మంది పరీక్ష రాశారు. ఇంజనీరింగ్‌లో 89.12 శాతం, అగ్రికల్చర్‌లో 95.06 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement