Monday, May 6, 2024

AP – 25వేల పోస్టుల‌ని చెప్పి ఆరు వేలకే నోటిఫికేష‌నా – జ‌గ‌న్ ను దులిపేసిన ష‌ర్మిల

అమ‌రావ‌తి – ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై నిత్యం దుమ్మెత్తి పోస్తున్న పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఆ పార్టీ సోషల్ మీడియా టార్గెట్ గా ఎక్స్ లో పోస్టు పెట్టారు. వైసీపీ సర్కార్ పై తాను చేస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇస్తున్న సోషల్ మీడియా విభాగం చేతనైతే తన ప్రశ్నలకు జవాబు ఇవ్వాలంటూ ఆమె సవాల్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో తాజాగా ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీని టార్గెట్ చేస్తూ షర్మిల అన్న వైఎస్ జగన్ ను టార్గెట్ చేశారు. మధ్యలో తండ్రి వైఎస్సార్ ను కూడా లాగారు.

గతంలో 52 వేల పోస్టులతో మహానేత వైఎస్సార్ డీఎస్సీ వేస్తే.. ఇప్పుడు ఆయన వారసుడిగా చెప్పుకునే జగన్ అన్న 6 వేల పోస్టులతో దగా డీఎస్సీ వేశాడని వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ నాయకులు, వీళ్ళను మోసే సోషల్ మీడియాకు ఓ సవాల్ అంటూ షర్మిల పలు ప్రశ్నలు సంధించారు. ఇందులో గతంలో వైఎస్ హయాంలో నిర్వహించిన డీఎస్సీకి, ఇప్పుడు జగన్ సర్కార్ నిర్వహిస్తున్న డీఎస్సీకి మధ్య తేడా గుర్తుచేశారు.

2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడని అన్న జగన్ ను షర్మిల ప్రశ్నించారు. 5 ఏళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారని నిలదీశారు. ఎన్నికలకు నెలన్నర ముందు 6 వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటన్నారు. టెట్,డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా అని అడిగారు.

టెట్ కి 20 రోజులు,తర్వాత డీఎస్సీ మద్య కేవలం 6 రోజుల వ్యవధేనా ఇచ్చేది అని షర్మిల అడిగారు. వైఎస్ హయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్ కి గుర్తులేదా అని అడిగారు. ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా అని ప్రశ్నించారు. రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా అని అడిగారు.
మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా ? ఇది కక్ష్య సాధింపు చర్య కాదా? అని షర్మిల నిలదీశారు. నవ రత్నాలు,జాతి రత్నాలు అని చెప్పుకొనే జగన్ ఆన్న.. ఆయన చుట్టూ ఉండే సకలం శాఖ మంత్రులు ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలన్నారు.

1. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ ? 2. 5 ఏళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు ? 3. ఎన్నికలకు నెలన్నర ముందు 6 వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి ? 4. టెట్,డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి ? 5. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా ? టెట్ కి 20 రోజులు,తర్వాత డీఎస్సీ మద్య కేవలం 6 రోజుల వ్యవధి నా ? 6.YSR హయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్ కి గుర్తులేదా ? 7. ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా ? 8.రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా ? 9. మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా ? ఇది కక్ష్య సాధింపు చర్య కాదా? ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement