Thursday, May 9, 2024

AP | నూతన సంవత్సర వేడుకలకు నిబంధనలు..

విజయవాడ, (ప్రభ న్యూస్) : నూతన సంవత్సర వేడుకలు అర్ధరాత్రి ఆరుబయట అనుమతులు లేవని పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా తెలిపారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ సెక్షన్ 144 సి.ఆర్.పి.సి. అమలులో ఉన్నందున బహిరంగ ప్రదేశాలలో ఐదుగురు అంతకన్నా ఎక్కువ వ్యక్తులు గుమ్మిగూడటం నిషేధంగా చెప్పారు. కరోన కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంక్షలు తప్పనిసరన్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు…

ప్రధాన రహదారులైన బందరు రోడ్, ఏలూరు రోడ్, బి.ఆర్.టి.ఎస్. రోడ్లపై పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా తెలిపారు. అదేవిధంగా బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్, కనకదుర్గ పై ఓవర్ మరియు పి.సి.ఆర్. ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ అనుమతిచబడదన్నారు. క్లబ్బులు, రెస్టారెంట్లలో వేడుకలు నిర్వహించుకొనుటకు ముందస్తు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలన్నారు. నిర్వాహకులు సామాజిక దూరం ఇతర కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, సీటింగ్ కెపాసిటీలో 60 శాతం వరకు మాత్రమే అనుమతించేటట్లు నిబంధనలు పాటించాలన్నారు.

ఆరుబయట ప్రదేశాలలో డి.జె.లు ఎక్కువ శబ్దాన్ని ఇచ్చే సౌండ్ సిస్టంను వినియోగించరాదన్నారు. మద్యం సేవించి రోడ్లపై వాహనములు నడుపరాదు, అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకొనబడునన్నారు. గుంపులు, గుంపులుగా చేరి నడి రోడ్డుపై కేకులు కోసి అల్లర్లు చేయరాదన్నారు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి వేళ కేకలు వేస్తూ వాహనాలపై తిరగ రాదన్నారు. జనవరి 1వ తేదీన నూతన సంవత్సర శుభాకాంక్షలు పరస్పరం తెలుపుకునేటప్పుడు మాస్కులు, శానిటైజర్లు వాడుతూ నిబంధనలు పాటించాలన్నారు..

- Advertisement -

హద్దుమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవు.

డిసెంబర్ 31వ తేదీన రాత్రి నగరంలో గస్తీ ముమ్మరంగా ఉంటుందనీ హద్దు మీరు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగాఉంటాయన్నారు. ద్విచక్ర వాహనాలకు సైలేన్సర్ తీసేసి అధిక శబ్దాలతో హోరెత్తించడటం, బాణాసంచా పేల్చడం వంటి వాటి వలన ప్రశాంతతకు భంగం కలిగి వృద్ధులకు, చిన్న పిల్లలకు, రోగులకు, ఇబ్బంది కలుగుతుంది.

కావున ఇలాంటి వాటికి పాల్పడితే తగిన చర్యలు తీసుకొనబడునన్నారు.అధిక మత్తు వల్ల విచక్షణ కోల్పోయి దుర్మార్గపు పనులు చేసే అవకాశం ఉంది. అలాగే ప్రమాదాలు సంభవించి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా. ఈవ్ టీజింగ్ కు పాల్పడినా చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోబడునన్నారు. తల్లిదండ్రులు ఈవిషయాలను గమనించి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలసిన అవసరంఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement