Sunday, April 28, 2024

HYD: అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా

హైద‌రాబాద్ : సికింద్రాబాద్ వారసిగూడలోని బౌద్ధ నగర్ లో జి ఆంజనేయ స్వామి ఇంటి వద్ద శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో టూరిజం పూర్వ ఛైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. 34వ సారి అయ్యప్ప మాల ధరించిన జి రమేష్ గురు స్వామి, కన్నె స్వామి జి ఆంజనేయస్వామి ఆధ్వర్యంలో ఈ అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమం జరిగింది.

ఈ పడిపూజ కార్యక్రమంలో ఐవీఎఫ్‌ సికింద్రాబాద్ జోన్ అధ్యక్షులు నర్సింగరావు గుప్తా, తూప్రాన్ ఐవీఎఫ్ మెంబ‌ర్ నారాయణ గుప్తా, టీడీపీ లీడర్ వెంకటేష్, ప్రకాష్, చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. ప్రజలందరి పైన ఆశీస్సులు ఉండాలని, దేశంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అయ్యప్పస్వామిని కోరుకోవడం జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement