Saturday, May 18, 2024

అస్వస్థతకు గురైన ఏపీ మంత్రి విశ్వరూప్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు అమలాపురంలో మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో కిందపడిపోయారు. దీంతో ఆయనను అమలాపురంలోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. మరో రెండు రోజుల పాటు ఆస్పత్రిలో అబ్జర్వేషన్‌లో ఉండాలని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందడంతో… వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. గుండెకు సంబంధించిన సమస్య కాదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement