Sunday, May 5, 2024

చర్లపల్లి జైలులో రాజాసింగ్ కు భద్రత పెంపు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చర్లపల్లిలో జైలులో ఉన్నారు. ఓ మతాన్ని కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విధితమే. అయితే రాజాసింగ్ కు పోలీసులు భద్రత పెంచారు. అంతేకాకుండా ఆయనను పోలీసులు శారద బ్యారక్ కు మార్చారు. జైలులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఆయనకు భద్రత పెంచారు. దీంతో పాటు రాజాసింగ్‌ను కలిసేందుకు వస్తున్న వారిపైనా నిఘా పెట్టారు. 

ఇదిలా ఉండగా.. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని ఆయన సతీమణి ఉషాబాయి బీజేపీ అధిష్టానానికి లేఖ రాశారు. బిజెపి క్రమశిక్షణ కమిటీ.. రాజాసింగ్ ను సస్పెండ్ చేస్తూ ఆయనను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ గడువు రేపటితో ముగియనుండడంతో బీజేపీ క్రమశిక్షణ కమిటీకి ఉషాబాయి లేఖ రాశారు. రాజాసింగ్ జైలులో ఉన్నారని తన సస్పెన్షన్ రేపటితో ముగియనుండటంతో సమయం ఇవ్వాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement