Sunday, April 28, 2024

తెలంగాణ రాష్ట్రాన్ని బలవంతంగా లాక్కున్నారు: కేసీఆర్ పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్య

తెలంగాణ రాష్ట్ర ముఖ్యంత్రి కేసిఆర్ పై ఏపి దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బలవంతంగా రాష్ట్రాన్ని లాక్కుని ఆంధ్ర రాష్ట్రంపై ఆవాక్కులు చవాక్కులు పేల్చుతున్నారని మండిపడ్డారు. శనివారం శ్రీశైల భ్రమరాంభా సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని మంత్రి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్థికంగా బలంగా ఉన్నామని సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్‌పై ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులు, ఏపీపై అవాకులు చవాకులు మాట్లాడటం మంచి పద్ధతి కాదని వెల్లంపల్లి శ్రీనివాస్ హితవు పలికారు.

ఏపిలో పోలీసుల రాజ్యం నడుస్తుందన్న టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలో లేకపోతే ఇంకోలా మాట్లాడటం ఆయనకు అలవాటని విమర్శించారు. చంద్రబాబుకి ముణి శాపం ఉందన్నారు. చంద్రబాబు నిజం మాట్లాడితే తల వెయి ముక్కలౌవుందని వ్యాఖ్యానించారు. ముందుగా శ్రీశైలం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు ఈఓ లవన్న అర్చకులు వేదపండితులు స్వాగతం పలికారు అనంతరం మంత్రి శ్రీ బ్రమరాంభా సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి: పంజాగుట్ట మర్డర్ కేసు: తల్లే హంతకురాలు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి 

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement