Sunday, April 28, 2024

చంద్ర‌బాబు, లోకేష్ ల‌ను కించ‌ప‌రిచేలా… మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్య‌లు

ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా తెలుగుదేశం పార్టీ నేత‌లు నారా చంద్ర‌బాబు, నారా లోకేష్ ల‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించలేని చంద్ర‌బాబు నాయుడు చీర కట్టుకోవాలని అన్నారు. ఈరోజు మంత్రి ఆర్ కె. రోజా అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్యేగా గెలవలేని నారా లోకేష్ కూడా చీర కట్టుకోవాలన్నారు. శారీ కావాలో చుడీదార్ కావాలో TDP నేతలే తేల్చుకోవాలని మంత్రి రోజా ప్రశ్నించారు. దమ్మున్న సీఎం జగన్ గురించి టీడీపీకి చెందిన మహిళా నాయకురాలితో అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆమె మండిపడ్డారు. సీఎం సతీమణిపై కూడా నీచంగా టీడీపీ నేతలు మాట్లాడడాన్ని తప్పు బట్టారు. టీడీపీలో ఉన్నంత మంది ఉన్మాదులు దేశంలో ఎక్కడా లేరన్నారు. టీడీపీ మహిళా ద్రోహుల పార్టీ అని రోజా విమర్శించారు. అందరి కంటే పెద్ద ఉన్మాది చంద్రబాబు అని ఆమె విమర్శించారు. టీడీపీ మహిళా ద్రోహుల పార్టీ అని మంత్రి రోజా మండిపడ్డారు. చంద్రబాబును ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. సీఎం జగన్ ఇమేజ్ ను దిగజార్చేందుకు టీడీపీ కంకణం కట్టుకుందన్నారు. మహిళా సాధికారిత దిశగా సీఎం వైఎస్ జ‌గ‌న్ కృషి చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement