Saturday, April 27, 2024

AP | పి.గన్నవరం, పోలవరం అభ్యర్థులను ప్రకటించిన జనసేన..

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ తన పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. ఈ స్థానంలో జనసేన నుంచి గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తారని పవన్ శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్నికల నియమావళితో కూడిన పత్రాలను ఆయనకు అందజేశారు. అలాగే ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేశారు. ఈ స్థానం నుంచి జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు పోటీ చేయనున్నారు.

ఈ సందర్భంగా పి.గన్నవరం నియోజకవర్గ నాయకులతో జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడి నామినేషన్లు వేయడానికి కూడా వీలు లేకుండా చేసింది. వాటన్నింటిని తట్టుకుని పి.గన్నవరం జనసేన నాయకులంతా ఒక్క మాటపై నిలబడ్డారు. రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇతర పార్టీలతో సత్తా చాటింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. ఈ ఎన్నికలు రాష్ట్రానికి దిశానిర్దేశం చేశాయి. పోటీ చేసే ప్రతి స్థానం కీలకమే. పి.గన్నవరంలో జనసేన కచ్చితంగా గెలుస్తుంది.’ అని పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement