Saturday, April 27, 2024

జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్

ఏపీలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి హైకోర్టులో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఉపాధి హామీ పథకం బిల్లుల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ పథకం వేతనదారులకు బిల్లులు చెల్లించక పోవడంపై మండిపడింది. ఈ నెల 15వ తేదీలోగా బిల్లులు చెల్లించకపోతే కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. రెండు వారాల క్రితం 494 కేసుల్లో బిల్లుల చెల్లింపులు చేయాలని ఆదేశిస్తే కేవలం 25 కేసుల్లో మాత్రమే చెల్లింపులు చేయడం పట్ల హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, సర్పంచ్ అకౌంట్లోకి డబ్బులు వేస్తే వారు కాంట్రాక్టర్‌కు చెల్లించడం లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో వివరాలు ఇస్తే వారిపై కూడా కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హైకోర్టు తేల్చి చెప్పింది.

ఈ సందర్భంగా కొన్ని కేసుల్లో విచారణ జరుగుతోందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. అయితే, విచారణ జరపకుండానే జరుగుతుందని చెబుతూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపించారు. దీంతో రెండున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడు విచారణ ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. విచారణ చేపడితే పిటిషనర్లకు నోటీసులు ఇచ్చారా అని హైకోర్టు ప్రశ్నించింది.

రెండున్నరేళ్ల పాటు చెల్లింపులు నిలిపివేస్తే కాంట్రాక్టర్ల జీవనాధారం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. 20 శాతం నుంచి 30 శాతం చెల్లింపులను కట్ చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 15వ తేదీ వరకు ఎవరికి ఎంత మొత్తం చెల్లించారో పిటిషనర్, ప్రభుత్వం వివరాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 15వ తేదీ లోపు బిల్లులు చెల్లించకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: ఏపీలో నూతన విద్యా విధానం!

Advertisement

తాజా వార్తలు

Advertisement