Saturday, April 20, 2024

ఏపీలో నూతన విద్యా విధానం!

నూతన విద్యా విధానం అమలుపై అన్ని రకాలుగా సిద్ధం కావాలని, ఆ దిశగా అడుగులు ముందుకేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. నాడు-నేడు, ఫౌండేషన్‌ స్కూళ్లపై మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. రెండో దశ నాడు-నేడు పనుల ప్రగతిపై సమీక్షించారు. పాఠ్య పుస్తకాల ముద్రణ నాణ్యతను పెంచడంతో పాటు, కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌పై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. ముందుగా వేయి స్కూళ్లను అఫిలియేషన్‌ చేస్తున్నామని అధికారులు తెలిపారు. అన్ని రకాల స్కూళ్లు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఐసీఎస్‌ఈ అఫిలియేషన్‌మీద కూడా దృష్టిపెట్టాలని సీఎం సూచించారు.

నాడు – నేడు కింద రెండో విడతలో 12,663 పాఠశాలలను ఆధునీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 4535.74 కోట్ల రూపాయల ఖర్చుకు ప్రణాళికలు వేసినట్లు తెలిపారు. 18,498 అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మూడో విడతలో నాడు–నేడు కింద 24,900 స్కూళ్లు చేపడుతున్నట్లు వివరించారు. ఇందుకోసం రూ.7821 కోట్ల ఖర్చు అంచనా వేసినట్లు తెలిపారు. రెండో దఫా నాడు – నేడుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. నాడు – నేడు పనులకు సంబంధించి సచివాలయంలో ఇంజినీర్లకు శిక్షణ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. సుమారు 12వేల మందికి శిక్షణ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం పేరెంట్స్‌ కమిటీలకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. స్కూళ్ల నిర్వహణ, టాయిలెట్ల నిర్వహణలపై ప్రత్యేక శ్రద్ద చూపించాలని సీఎం జగన్ ఆదేశించారు.  

నాడు – నేడు కార్యక్రమం ద్వారా ఇంత డబ్బు ఖర్చుపెట్టిన తర్వాత కచ్చితంగా స్కూళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, లేకపోతే మళ్లీ పూర్వపు స్థితికి వెళ్లిపోతాయన్నారు. స్కూళ్లలో ఎలాంటి మరమ్మతులు వచ్చినా, ఏదైనా సమస్యలు వచ్చినా వెంటనే చేయించడానికి ఫండ్‌ ఒకటి ప్రతి స్కూల్లో ఉంచాలని సీఎం స్పష్టం చేశారు. దీనిపై ఎస్‌ఓపీలను తయారు చేయాలని, అప్పుడే స్కూళ్లు నిత్యనూతనంగా ఉంటాయన్నారు. ఈ ఏడాది విద్యాకానుక కింద నూటికి నూరుశాతం పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు.

ఈ ఏడాది జగనన్న విద్యాకానుక కింద నూటికి నూరుశాతం పంపిణీ పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు. వచ్చే ఏడాది విద్యా కానుక కింద ఇవ్వనున్న వస్తువులపై సీఎంకు వివరాలు అందించారు. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నందున వచ్చే ఏడాది పిల్లలు స్కూల్‌కు వెళ్లేనాటికే విద్యాకానుక అందించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. విద్యాకానుక కింద ఇచ్చే వస్తువులు నాణ్యతగా ఉండాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి విద్యాకానుకలో భాగంగా స్పోర్ట్స్‌ షూ, స్పోర్ట్స్‌ డ్రస్‌, మంచి డిజైన్, నాణ్యత ఉండేలా చూడాలని తెలిపారు. స్వేచ్ఛ కార్యక్రమం కింద స్కూల్లో ఆడపిల్లలకు శానిటరీ నాప్‌కిన్స్‌ పంపిణీ కార్యక్రమం చేసినట్లు చెప్పారు. అక్టోబరు మధ్యంతరంలో కార్యక్రమం ప్రారంభానికి సన్నహాలు చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు.

- Advertisement -

ఇది కూడా చదవండి: వైసీపీ నేత మళ్లను అరెస్ట్ చేసిన ఒడిశా పోలీసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement