Friday, April 26, 2024

కర్ఫ్యూ ఉండగా వేలం ఎలా నిర్వహిస్తారు?

ఏపీలో దేవాదాయ భూములను బహిరంగ వేలం వేయాలన్న ఆదేశాలు సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారించింది. కొవిడ్, కర్ఫ్యూ ఉండగా ఎలా బహిరంగ వేలం నిర్వహిస్తారని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వేలం కోసం కృష్ణా జిల్లా పెద్ద కళ్లెపల్లిలో ఆలయం పిలిచిన టెండర్ ఆదేశాలు హైకోర్టు రద్దు చేసింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జులై7కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement