Saturday, April 27, 2024

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం..

ఏపీలో వరుసగా మూడోసారీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆర్డినెన్స్ జారీ చేశారు. తాజా ఆర్థిక సంవత్సరం 2021-22 తొలి మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలుపగా, ప్రభుత్వం ఆ మేరకు ఆర్డినెన్స్ ఉత్తర్వులు ఇచ్చింది. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ మాసం వరకు సుమారు రూ.86 వేల కోట్ల నిధుల వ్యయానికి వెసులుబాటు కలిగింది. ఏపీలో గత మూడేళ్లుగా వివిధ కారణాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆర్డినెన్స్ ఇస్తూ వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement