Monday, May 20, 2024

Breaking: ఏపీ మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. నారాయణపై లుకౌట్ నోటీసు తొలగించాలని బ్యూరో ఇమ్మిగ్రేషన్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లుకౌట్ నోటీసుల వల్ల అమెరికా వెళ్లలేకపోతున్నారని నారాయణ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం డిసెంబర్ 22 నాటికి అమెరికా నుంచి తిరిగి రావాలని హైకోర్టు ఆదేశించింది. తన శస్త్ర చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లకుండా తనను అడ్డుకునేందుకు లుకౌట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీచేశారని, దానిని రద్దు చేయాలని కోరుతూ నారాయణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement