Sunday, April 28, 2024

Breaking: PRC పై రెండు రోజుల్లో ప్రకటన: సీఎం జగన్ స్పష్టీకరణ

పీఆర్సీ అంశంపై ఉద్యోగులతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తో సీఎం సమావేశం జరిగింది. ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలను సీఎం తెలుసుకున్నారు. పీఆర్సీ, ఫిట్ మెంట్, ఇతర సమస్యలపై ఒక్కో సంఘం నుంచి వివరాలు సేకరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులకు సీఎం వివరించారు.

పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని సీఎం తెలిపారు. ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఉద్యోగులకు మంచి చేయాలన్న తపనతో ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా  కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని సీఎం జగన్ కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement