Thursday, April 25, 2024

వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల కోటాను పెంచిన టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల, తిరుపతి వాసులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. స్థానిక భ‌క్తుల సౌక‌ర్యార్థం వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోటాను టీటీడీ పెంచింది. ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డి చొరవతో స్థానికులకు వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల కోటా పెరిగింది. ముందుగా రోజుకి 5 వేల చొప్పున మొత్తం 50 వేల మందికి దర్శన టికెట్లను కేటాయించాలని భావించింది టీటీడీ.. అయితే, ఎమ్మెల్యే కరుణాకర్‌ రెడ్డి చొరవతో ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది.. రోజుకి 10 వేల చొప్పున మొత్తం లక్ష టికెట్లను స్థానికులకు వైకుంఠ ద్వారా దర్శనం కోసం టీటీడీ కేటాయించేందుకు అంగీకరించింది. ఈ నెల 9వ తేదీన లేదా 11వ తేదీన గానీ స్థానికులకు వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లను కేటాయించేందుకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఏర్పాట్లు చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement