Tuesday, May 7, 2024

AP: సొంతింటి కల కార్యరూపం.. 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ

విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల ప్రజల సొంతింటి కల కార్యరూపం దాల్చనుంది. నేడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం ఇందుకు వేదిక కానుంది. లే అవుట్‌లో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి,  పార్కును ప్రారంభిస్తారు. లే అవుట్‌ స్వరూపాన్ని పరిశీలించిన అనంతరం మోడల్‌ గృహాల్ని లబ్ధిదారులకు అందజేస్తారు.

పైలాన్‌ను ఆవిష్కరించి, భూ సమీకరణకు సహకరించిన రైతులతో సీఎం జగన్ కాసేపు మాట్లాడి, వారితో ఫొటోలు దిగనున్నారు. అనంతరం సభా ప్రాంగణంలో లబ్ధిదారులతో మాట్లాడతారు. ఆ తర్వాత మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చే ఎంఐజీ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అనంతరం సభలో సీఎం జగన్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement