Thursday, April 25, 2024

Crime: గుంటూరులో మరో దారుణం.. మహిళపై అత్యాచారం

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వైకల్యంతో జరిగిన విజయవాడ గ్యాంగ్ రేప్ కేసు మరువకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని తుమ్మపూడిలో ఓ మహిళపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేయడం గ్రామంలో సంచలనం రేపింది. ఇంట్లో ఉన్న తిరుపతమ్మ అనే మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన దుండగులు.. ఆమెను హత్య చేసి పారిపోయారు. మొదట్లో అనుమానస్పద మృతిగా భావించిన పోలీసులు.. మృతిరాలి ఒంటిపై ఉన్న గాయాలతో ఆమెపై అత్యాచారం జరిగిందని గుర్తించారు. మహిళ మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement