Saturday, September 21, 2024

Breaking : సీఐని దూషించ‌లేదు – పోలీసులంటే గౌర‌వం ఉంది – ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి

వేదిక‌పై న‌న్ను ఇబ్బంది పెట్టారన్నారు టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి. రూర‌ల్ సీఐని ఎందుకు ఇలా జ‌రిగింద‌ని అడిగాన‌న్నారు..పోలీసులు అంటే నాకు గౌర‌వం ఉంద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకే పోలీసుల‌కి ఫోన్లు చేశాన‌న్నారు. ఆ ఆడియో రికార్డు త‌న ద‌గ్గ‌ర ఉంద‌న్నారు.అది ఎలా వ‌చ్చిందో తెలియ‌ద‌న్నారు. సీఐని తాను దూషించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. నేను మ‌న‌స్తాపం చెందాన‌ని ఎమ్మెల్యే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌న్నారు. రూల్ సీఐ,టౌన్ సీఐతో మాట్లాడాన‌న్నారు. ఆ ఆడియో రికార్డు త‌న‌ది కాద‌న్నారు. భార్య‌ని చంపిన వ్య‌క్తిని నా ముందు వేదిక‌పై కూర్చొబెట్టార‌న్నారు. మా ముందు రౌడీషీట‌ర్లు వ‌చ్చి ఇబ్బంది పెట్టార‌న్నారు. ఎమ్మోల్యే వెంటే ఇద్ద‌రు రౌడీ షీట‌ర్లు ఉంటార‌న్నారు. తాండూరు ప్ర‌జ‌లు రౌడీలు కాదు..దేవుళ్ల‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement