Monday, May 6, 2024

AP: 6న ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 6వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉండే అవకాశముంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ తొలిసారిగా ఢిల్లీ వెళ్తున్నారు.

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మరో వైపు ఏపీ రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయమై వీరిద్దరితో చర్చించనున్నారు. రాష్ట్రానికి చెందిన సమస్యలపై కేంద్రమంత్రులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ చర్చించే అవకాశముంది. రెండు రోజుల పాటు సీఎం జగన్ న్యూఢిల్లీలోనే ఉంటారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement