Saturday, May 4, 2024

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న సీఎం  జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒడిశా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 9న ఆయన భువనేశ్వర్ లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల జల వివాదాల గురించి ఈ సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.

ఇరు రాష్ట్రాల మధ్య పలు జల వివాదాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో వివాదం నడుస్తోంది. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి గతంలోనే నవీన్ పట్నాయక్ కు జగన్ లేఖ రాశారు. ఈ బ్యారేజ్ నిర్మాణంతో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, ఒడిశాలోని గజపతి జిల్లాకు మేలు కలుగుతుందని లేఖలో జగన్ పేర్కొన్నారు. ఇప్పటికే 80 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని చెప్పారు. తన ఒడిశా పర్యటనలో నవీన్ పట్నాయక్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులను కూడా జగన్ కలవనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement