Saturday, May 4, 2024

7న హైదరాబాద్ కు సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ఈ నెల ఏడవ తేదీన అంటే ఎల్లుండి హైదరాబాద్ కు రానున్నారు. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఎల్లుండి ముచ్చింతల్ చిన జీయర్ స్వామి ఆశ్రమంలో శ్రీ రామానుజులవారి సహస్రాబ్ది ఉత్సావాల్లో పాల్గొననున్నారు. అనంతరం.. తిరిగి సాయంత్రం… తాడేపల్లి గూడేనికి వెళ్లనున్నారు. అలాగే ఈ నెల 11 న మరోసారి హైదరాబాద్ వెళ్ళనున్నారు ముఖ్య మంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి. మంత్రి బొత్స సత్య నారాయణ కుమారుడి వివాహ వేడుక హైదరాబాద్ లో జరుగనుంది. ఈ నేపథ్యంలోనే జగన్ హైదరాబాద్‌ రానున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement