Monday, May 6, 2024

ఏపీ ప్రజలను లంక రాక్షసులతో పోలుస్తారా?.. తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ నేత ఫైర్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌డుతోన్న నీటి ప్రాజెక్టుల‌పై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లపై విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు ఆంధ్రప్రదేశ్ ప్రజలను, రైతులను అవమానపరిచేలాగ లంక రాక్షసులతో పోల్చడన్ని ఖండించారు. ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన మంత్రిపై తెలంగాణ సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా మంత్రులు వ్యవహరిస్తోందని మండిపడ్డార. రాష్ట్ర విడిపోయిన తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం తెలంగాణకు సహకరించిందని గుర్తు చేశారు. విభజన గాయాన్ని మర్చిపోతున్న తరుణంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం టీఆర్ఎస్ పార్టీ వివాదం సృష్టిస్తోందని చెప్పారు. రాబోయే ఉప ఎన్నికలో లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వామే అక్రమ ప్రాజెక్టులు కడుతోందని చెప్పారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం ఎందుకు మెతక వైఖరి అవంభిస్తోందని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement