Sunday, April 28, 2024

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు రేప‌టికి వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. మూడు రోజుల పాటు సెలవుల అనంతరం ఈరోజు ప్రారంభమైన సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా మరణాలపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్‌ వెల్‌లోకి దూసుకువచ్చి నిరసనలు తెలియ జేయడంతో సమావేశాన్ని రెండుసార్లు వాయిదా వేశారు. పట్టువీడని దేశం సభ్యులు కాగితాలను చింపివేసి స్పీకర్‌పై పడవేశారు. దీంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, ఆల వీరాంజనేయ స్వామిని సస్పెన్షన్‌ చేస్తు నిర్ణయం తీసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement