Monday, April 29, 2024

ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్న పాలకవర్గం: కర్నూల్ మేయర్

ఏడాది క్రితం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుందని కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా స్థానిక మేయర్ క్యాంపు కార్యాలయంలో బి.వై. రామయ్య పార్టీ శ్రేణులతో కేక్ చేశారు.

ఈ సందర్భంగా బి.వై. రామయ్య మాట్లాడుతూ ఏడాది క్రితం జరిగిన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టానికి, సుపరిపాలనకు మార్కులుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52 వార్డులకు గారు 41 వార్డుల్లో వైయస్ఆర్ సిపి అభ్యర్థులు గెలిచి పాలనకు 78.84% శాతం మార్కులు ఇచ్చారన్నారు.అలాగే జిల్లాలో జరిగిన 302 వార్డుల్లో 257 వార్డులతో కర్నూలు కార్పొరేషనుతో పాటు మిగతా 8 మున్సిపాల్టీల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే విజయ దుందుభి మోగించిందన్నారు.రాష్ట్రంలో ఏ ఎన్నికలు అయిన ఎప్పుడూ జరిగినా ఫలితాలు ఇవే రిపిట్ అవుతాయన్నారు.ఈ అపూర్వమైన విజయం అందించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement