Friday, April 26, 2024

దేశానికే దిక్సూచిగా ఏపీ.. జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో జగనన్న తోడు మూడవ విడత నిధులను విడుదల చేశారు. ఈసందర్భంగా బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ… రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గిట్టని వాళ్లు అబద్దాలు చెబుతున్నారన్నారు. కోటిమంది రైతులకు వెన్నుదన్నుగా ఉన్నామన్నారు. కోటి మంది మహిళలకు తోడుగా నిలిచామన్నారు. రైతు భరోసా ద్వారా 80శాతం పంటలకు సాయం చేస్తున్నామన్నారు. నవరత్నాల ద్వారా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి మేలు చేస్తున్నామన్నారు. ముసలాయన ప్రభుత్వంలో గజదొంగల ముఠా ఉండేదన్నారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు కలిసి డీపీటీ చేసేవారన్నారు. అంటే దోచుకో.. పంచుకో.. తినుకో.. రీతిన రాష్ట్రాన్ని దోచేశారన్నారు. అప్పుడు ప్రశ్నిస్తానన్ని దత్తపుత్రుడు ప్రశ్నించలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement