Wednesday, May 22, 2024

AP : ఇవాళ నంద్యాలలో లోకేశ్‌ యువగళం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ నంద్యాలలో యువగళం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ నగర్ సమీపంలో సాయంత్రం యువ గళం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున నంద్యాల శివారులోని ఓ పంక్షన్‌ హాలులో బసచేయనున్నారు.

- Advertisement -

ఉదయం నుంచి ఫంక్షన్‌ హాలులో వివిధ సామాజిక వర్గాల నాయకులతో ఆయన సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటల నుంచి రాణి థియేటర్‌ వెనుక వైపు ఉన్న ప్రాంతంలో టీడీపీ శ్రేణులతో నారా లోకేశ్‌ సమావేశమై ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్ధేశం చేస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement