Saturday, April 27, 2024

Big Breaking: కోవిడ్ కొత్త వేరియంట్ పై రాష్ట్రాలకు కేంద్రం మరో లేఖ

కోవిడ్ కొత్త వేరియంట్ పై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. టెస్ట్ – ట్రాక్- ట్రీట్ అండ్ వ్యాక్సినేషన్ చేపట్టాలని సూచించింది. మాస్కులు, వ్యక్తిగత పరిశుభ్రత, భౌతికదూరం పాటించాలని కేంద్రం రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొంది. పండుగల సీజన్ నేపథ్యంలో చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ సూచనలు పాటించాలని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement