Tuesday, May 7, 2024

పెడన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఝలక్

పెడన టౌన్ : కృష్ణా జిల్లాలోని పెడన జయలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు తోట ఆనంద్ కిషోర్ ఓ కేసులో జైలుకు వెళ్లారు. రెండ్రోజుల క్రితం సినీ హీరో నాగ శౌర్య ఫామ్ హౌస్ లో జ‌రిగిన ఘ‌ట‌న‌లో ఆనంద్ కూడా ప‌ట్టుబ‌డ్డారు.

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలోని పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో ఆయ‌న ప‌ట్టుబ‌డ్డారు. ఇటీవలే ఎమ్మెల్యే జోగి రమేష్ నుండి నామినేటెడ్ పదవి దక్కించుకున్న ఆనంద్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఈ క్ర‌మంలో అరెస్ట్ చేసిన నార్సింగ్ పోలీసులు జైలుకు త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement