Monday, April 29, 2024

ఉక్రెయిన్ నుంచి ఏపీ, తెలంగాణ‌కు చెందిన మ‌రో 18 మంది స్టూడెంట్స్ రాక‌..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : యుద్ధభూమి ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు విడతలవారీగా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ప్రత్యేక విమానాలలో 9 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. ఎవరి విమాన టికెట్ల షెడ్యూల్ ప్రకారం వారిని భవన్ అధికారులు హైదరాబాద్ పంపించే ఏర్పాట్లు చేశారు. మరోవైపు సోమవారం 9 మంది తెలంగాణా విద్యార్థులు ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి దేశ రాజధానికి వచ్చారు.

ఫిబ్రవరి 26 నుంచి ఆదివారం రాత్రి వరకు 625 మంది స్వస్థలాలకు చేరుకున్నారు. సోమవారం వచ్చిన 9 మందితో కలిపి 84 ప్రత్యేక విమానాల్లో మొత్తం 634 మంది తెలంగాణా విద్యార్థులు సురక్షితంగా భారత్‌కు తిరిగివచ్చారని అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement