Saturday, April 27, 2024

Covid-19: ఏపీలో కొత్తగా 10,310 కరోనా కేసులు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 39,296 కరోనా పరీక్షలు చేయగా… 10,310 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయింది. అత్యధికంగా కడప జిల్లాలో 1,697 కొత్త కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 1,379 కేసులు, గుంటూరు జిల్లాలో 1,249 కేసులు, కృష్ణా జిల్లాలో 1,008 కేసులు గుర్తించారు. కోవిడ్ తో రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది మృతి చెందారు.

అదే సమయంలో 9,692 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 14,606 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,70,491 పాజిటివ్ కేసులు నమోదు కాగా… ఇందులో 21,39,854 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,16,031 యాక్టివ్ కేసులున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement