Saturday, April 27, 2024

Andhra Pradesh – వైఎస్‌ షర్మిలకు లైన్ క్లియర్ – పిసిసి అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా

విజయవాడ – ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీలో వేగంగా మార్పులు జరుగుతున్నాయి.. పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపించారు రుద్రరాజు.. అయితే, రుద్రరాజు ఎందుకు రాజీనామా చేశారు? అంటే వైఎస్‌ షర్మిల కోసమే అని పార్టీ నేతలు చెబుతున్నమాట.. గిడుగు రుద్రరాజుతో రాజీనామా చేయించి షర్మిలకు లైన్‌ క్లియర్‌ చేసిన కాంగ్రెస్‌ అధిష్టానం..

ఒకటి, రెండు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించే అవకాశం ఉందంటున్నారు.. మణిపూర్‌లో పీసీసీ అధ్యక్ష పదవిపై వైఎస్‌ షర్మిలకు ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుండగా.. హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్టుగా సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement