Sunday, May 19, 2024

ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలుచేయాలి : రేపు ఢిల్లీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం దీక్ష

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండడం వల్ల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదాను అమలు చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘ నేతలు దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి రెండు గంటల వరకు నిరసన తెలుపుతున్నట్టు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement