Tuesday, May 21, 2024

నీటి కుంటలో పడి విద్యార్థి దుర్మరణం

గుంతకల్లురూరల్ : గుంతకల్లు మండల పరిధిలోని దోనిముక్కల గ్రామ శివారులో ఉన్న ఓ నీటి గుంతలో పడి నిశాంత్ (16) అనే విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. రూరల్ పోలీసులు అందించిన మేరకు వివరాలు ఇలాంటి ఉన్నాయి. గుంతకల్లు పట్టణంలోని ప్రశాంతి నగర్ లో నివాసముండే రాజు అనే వ్యక్తి చిన్న కుమారుడు నిశాంత్ సోమవారం సాయంత్రం తన మిత్రులతో కలసి దోనిముక్కల గ్రామ శివార్లలో ఉన్న బంగారప్ప బావి వద్దకు వెళ్లారు. ఈత కొట్టెందుకు నలుగురు బావిలోకి దిగారు. అయితే ఈత సరిగా రాని నిశాంత్ బావిలో కురుకుపోయాడు. దీంతో తోటి విద్యార్థులు హుటాహుటిన సమాచారాన్ని నిశాంత్ తల్లిదండ్రులకు చేరవేశారు. వారి ద్వారా ఫిర్యాదు అందుకున్న రూరల్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా విద్యార్థి మృతదేహం మంగళవారం మధ్యాహ్నం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement