Sunday, April 28, 2024

తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్లపై దాడులకు నిర‌స‌న‌గా మౌన ప్ర‌ద‌ర్శ‌న‌…

  • మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన
  • పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట టిడిపి శ్రేణులు బైఠాయింపు

తాడిపత్రి : అనంతపురం జిల్లా తాడిపత్రిలో గత రెండు రోజులుగా తెలుగుదేశం కౌన్సిలర్ల పై దాడుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు సీబీ రోడ్డు గుండా నల్ల బ్యాడ్జిలు ధరించి మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఇంతలో డీఎస్పీ వి.ఎన్. కె.చైతన్య అక్కడకు చేరుకుని.. నిరసనకారులను వెళ్ళిపోవలసిందిగా ఆదేశించారు. దీంతో స్థానిక పట్టణ సీఐ ఆనందరావు, తాడిపత్రి రూరల్( అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్) సీ.ఐ. చిన్న పెద్దయ్య, పామిడి రూరల్ సీఐ రామకృష్ణ, పట్టణ ఎస్ఐ ధరణి కుమార్, పెద్దవడుగూరు ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది నిరసనకారులను అక్కడి నుంచి బలవంతంగా పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement