Sunday, May 12, 2024

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు మృతి

ఓ రోడ్డుప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెందిన విషాధ ఘ‌ట‌న అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రాప్తాడు మండలం రామ్నేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరమ్మతుకు గురైన విద్యుత్‌ ట్రాన్స్‌కో కు సంబంధించిన మినీ లారీని మరో వాహనంతో తీసుకెళ్తుండగా.. గుర్తు తెలియన వాహనం వచ్చి ఢీ కొట్టింది. సంఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement