Friday, April 26, 2024

పాలించే వారే స‌క్ర‌మంగా లేక‌పోవ‌డం దారుణం : జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి

పాలించే వారే సక్రమంగా లేకపోవడం దారుణమని టీడీపీ సీనియ‌ర్ నేత‌, అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి మునిసిపాలిటీ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి అన్నారు. ఇటీవ‌లే ఏపీకి చెందిన 8మంది ఐఏఎస్ లు కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో ఏపీ హైకోర్టు ఆగ్ర‌హానికి గురైన విష‌యం విదిత‌మే. ఓ ద‌శ‌లో జైలు శిక్ష ఖ‌రారు కాగా..సారీ చెప్ప‌డంతో ఆ శిక్ష కాస్తా సేవ‌గా మారిన వైనం ఏపీ కేడ‌ర్‌కు చెందిన 8 మంది ఐఏఎస్ అధికారుల‌కు తీవ్ర ఇబ్బందిక‌రంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై ఆయా రాజ‌కీయ పార్టీలు త‌మకు తోచిన విధంగా స్పందిస్తున్నాయి. ఇందులో భాగంగా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ… ఐఏఎస్‌లతో పాటు ఐపీఎస్‌లూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారన్నారు. జ‌గ‌న్ నియ‌మించుకున్న‌ స‌ల‌హాదారుల్లో చాలా మందికి చ‌దువు రాదని ఘాటు వ్యాఖ్య చేసిన జేసీ… సంత‌కాల కోసం మాత్ర‌మే అధికారుల‌ను వాడుకుంటున్నారని ఆరోపించారు. హైకోర్టులో ఆదేశాలు ఇచ్చినా కింది స్థాయిలో అమ‌లు కావ‌ట్లేదని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కోర్టు తీర్పు ప‌ట్టించుకోని అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని జేసీ తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement