Saturday, May 4, 2024

ప్రజలందరికీ శుభాలు కలగాలి

నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో శుభకృత్ నామ సంవత్సరం శుభాలు తేవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆకాంక్షించారు. శనివారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అమర్ చంద్ కళ్యాణ మండపంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేద పండితులు నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరూ కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే దాసరి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement