Thursday, May 9, 2024

కాసేపట్లో పెళ్లి.. తనకు పెళ్లొద్దని మొండికేసిన వధువు

అనంతపురం: మరికొన్ని గంటల్లో ఆ ఇద్దరు మూడుముళ్ల బంధంతో ఒక్కటి కావాల్సి ఉంది. ఇరువర్గాల బంధువులతో కళ్యాణమండపం కళకళలాడుతోంది. పెళ్లి వేడుకల్లో భాగంగా వధూవరులకు నలుగు ప్రక్రియ జరిగే సమయంలో ఈ పెళ్లి తనకు ఇష్టం లేదంటూ వధువు మొండికేసిన ఘటన బుధవారం రాత్రి కదిరిలో జరిగింది. ధర్మవరానికి చెందిన వరుడు, ముదిగుబ్బకు చెందిన వధువుకు పెళ్లి నిశ్చయమైంది. గురువారం తెల్లవారుజామున పెళ్లి జరగాల్సి ఉంది. బుధవారం మధ్యాహ్నం వరకు ఇష్టం అని చెప్పిన వధువు మరికొన్ని గంటల్లో తాళికట్టే సమయంలో ఇలా మొండికేయడం ఏంటని వరుడి తరఫు బంధువులు వాగ్వాదానికి దిగారు. ఈ వ్యవహారం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. అమ్మాయి ఇష్టం లేదంటున్నందున ఎవరికివారు వెళ్లాలని కదిరి పట్టణ పోలీసులు సూచించారు. పెళ్లి నిరాకరించినందుకు వరుడి తరఫువారు తమను బెదిరిస్తున్నారని వధువు తల్లి పోలీసులకు తెలిపింది. ముదిగుబ్బ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కదిరి పోలీసులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement