Wednesday, April 24, 2024

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలను ఆర్జించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా సానుకూలంగానే కదలాడాయి. సెన్సెక్స్ ఈరోజు 48,877.78 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,980.69 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,614.11 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 0.50శాతం అంటే 243.34 పాయింట్లు ఎగిసి 48,921 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,668.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,725.05 వద్ద గరిష్టాన్ని, 14,611.50 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 0.59 0.50శాతం అంటే 86.60 పాయింట్లు ఎగిసి 14,705 పాయింట్ల వద్ద ముగిసింది. హిందాల్కో, హీరో మోటోకార్ప్, విప్రో, టాటా మోటార్స్ లాభాలను ఆర్జించాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యూపీఎల్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సెర్వ్ నష్టాలను చవిచూశాయి

.

Advertisement

తాజా వార్తలు

Advertisement